X

రంగస్థలంలో పూజా రెమ్యునరేషన్ అదిరిందిగా..!

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, అక్కినేని కొత్తకోడలు సమంత హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘రంగస్థలం’. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రాబోతున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే ఓ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడనుందన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పార్ట్ అంతా పూర్తవ్వగా మిగిలిపోయిన ఈ ఐటెం సాంగును ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ చేస్తున్నారు. ఏఅ పాట చిత్రీకరణతో షూటింగ్ అంతా పూర్తయినట్లే అని చెప్తోంది చిత్ర బృందం.

తెలుగు రాక్ స్టార్ దేవిశ్రీ సంగీతం అందిస్తున్న ఈ పాట ‘జిల్ జిల్ జిగేల్’ అంటూ సాగే హుషారెత్తే స్టెప్పులతో ఉంటుందని సమాచారం. ఇందులో పూజా.. రాం ఛరణ్తో కలసి అదిరిపోయే స్టెప్పులేస్తూ చీరకట్టులో తన అందచందాలను ఆరబోతతో కనువిందు చెయనుందని తెలుస్తోంది. అయితే ఈ ఒక్క ఐటెం సాంగ్ కోసమే పూజా చేసిన డిమాండ్ చూసి ఆశ్చర్యపోతున్నాయి సినీ వర్గాలు. ఇందులో తాను ఆడిపాడినందుకు గాను ఏకంగా 50 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుందట పూజా. కేవలం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ‘దువ్వాడ జగన్నాధం’ హిట్ మాత్రమే ఆమె ఖాతాలో ఉంది కానీ.. పూజా డిమాండ్ మాత్రం బోలెడంత ఉందిగా అంటూ అవాక్కవుతున్నారు ఈ వార్త విన్న సినీ జనాలు.

ఇప్పటికే విడుదలైన ‘రంగస్థలం’ మూవీ టీజర్ మంచి స్పందన తెచ్చుకుంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ టీజర్‌లో చెర్రీ మాత్రమే కనిపించారు. మరికొద్ది రోజుల్లో సమంతతో కూడిన మరో టీజర్ బయటకు వదిలేందుకు ఈ చిత్ర యూనిట్ అంతా రంగం సిద్ధం చేసింది . భారీ అంచనాల నడుమ మార్చి30న ఈ సినిమా విడుదలకానుంది.